ప్రయాగ్ రాజ్, బతుకమ్మ : యూపీలోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యసాన్నమాచరించారు. త్రివేణి సంగమం వద్ద రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు రాష్ట్రపతి ముర్ముకు సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు.

