బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ సిద్ధిరాములు తిరిగి వెనక్కి పంపించాలని మంగళవారం జిల్లా పంచాయతీ అధికారికి సమాచార హక్కు చట్టం ప్రతినిధి గంగుల రవీందర్ వినతి పత్రం అందజేశారు.13 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని వారు రెండు నెలల క్రితమే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళగానే మళ్లీ తిరిగి డిప్యూటేషన్ పై ఇక్కడికి రావడం ప్రజలకు ఆశ్చర్యం కలుగుతుందని విధులు సక్రమంగా నిర్వహించకపోవడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని వారు ఆరోపించారు. మా గ్రామపంచాయతీ కి రెగ్యులర్ గా వచ్చిన అధికారిని నియమించాలని వారు డిమాండ్ చేశారు.
