- బోర్గం సమీపంలో గల 40 మందికి ఆశ్రయం కల్పించిన పోలీసులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నందున బోర్గం పాంగ్ర వాగు నీళ్లు ఉప్పొంగి ప్రవహించడంతో బ్యాంకు కాలనీ లో నాలా ప్రక్కన ఉన్న దాదాపు 15 కుటుంబాలు నివసిస్తున్న గుడిసెలోకి నీళ్లు రావడంతో వారు నిరాశ్రయులయ్యారు. దాంతో కమిషనర్ ఆఫ్ పోలీసు పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నగర సిఐ శ్రీనివాస్ రాజు ఫోర్త్ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఉదయ్ ఇంకా సిబ్బంది కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని శివాజీ సమితి , స్థానికుల సహాయంతో అక్కడి నుంచి తరలించి పండ్లు పంపిణీ చేసి వారిని సురక్షిత ప్రాంతం బింగి ఫంక్షన్ హాల్ లో మహిళలు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కలిపి దాదాపు 40 మంది కి ఆశ్రయం కల్పించారు.

