30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అటవీశాఖ సిబ్బందిపై రాళ్ల దాడి చేసిన పోడు రైతులు

Must read

📰 Generate e-Paper Clip

ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత

ఆదిలాబాద్, బతుకమ్మ :  ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది, పోలీసులపై పోడు రైతులు దాడి చేశారు. తమ గ్రామంలోకి రావద్దంటూ రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆందోళన కారుల దాడిలో పోలీసులు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఫారెస్ట్, పోలీస్, మీడియా సిబ్బంది గాయాలు కావడంతో వారిని ఇచ్చోడ ప్రభుత్పస్పత్రికి తరలించారు. ఇందులో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు.

More articles

Latest article