పిట్లం, బతుకమ్మ : పిట్లంలోని ముకందర్ రెడ్డి కాలనీలో గల వినాయక మండపంలో ప్రతిష్టించిన వినాయకుని లడ్డూ వేలం పాటలో రికార్డు స్థాయిలో భారీ ధర పలికింది. పిట్లం సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సరిత, సూరత్ రెడ్డి లడ్డూ వేలంలో రూ.5,01,000 లకు దక్కించు కున్నారు. గతేడాది లడ్డూ వేలంలో 3,60,000 పలికినట్లు నిర్వాహకులు తెలిపారు.
