నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని శివాజీ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం క్షణికావేశంలో పురుగులు మందు తాగి అత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాసరి కిషన్ అదే రోజు మరణించగా, దాసరి వంశీ (30 ) చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. దాసరి నాగమణి పరిస్థితి విషమంగా ఉండటంతో హైద్రాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈమేరకు రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
