ఢిల్లీ, బతుకమ్మ : ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సోమవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీతో రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు.
