బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల లోని సిద్ధరామేశ్వర గ్రామంతో పాటు ఇతర గ్రామాల గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. గురువారం మండపాల ప్రతినిధులు గణేషులను భజన కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో పెట్టి డిజె సౌండ్ తో గ్రామాల్లో ఘనంగా ఊరేగింపు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భిక్కనూరు సిఐ సంపత్ కుమార్, ఎస్సై సాయికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
