25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

గాంధారి, బతుకమ్మ : సదాశివ నగర్ మండలంలోని మోడెగాం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన గంగుల నర్సాగౌడ్(55) మొండి సడక్ నుంచి చిన్న మల్లారెడ్డికి బైక్​పై వెళ్తున్నాడు. మోడెగాం శివారులోని రైస్​మిల్ వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సాగౌడ్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More articles

Latest article