బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామం దగ్గర ఎన్ హెచ్ 44 హైవేపై ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముత్యంపేటకు చెందిన కోడిపాక స్వామి గౌడ్ మృతి చెందాడు. ఎస్సై తెలిపిన సమాచారం ప్రకారం స్వామి గౌడ్ భిక్కనూరు నుండి కామారెడ్డి వైపు వెళ్తుండగా వెనుకాల టైరు పగిలి అదుపుతప్పి డివైడర్ కు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడం జరిగింది.