29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

15 వేల విలువగల నోట్ బుక్ లు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ :

మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ ప్రోత్సాహంతో వారి బంధు పప్పుల సంపత్ రూ. 15 వేల విలువగల రాత పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం ఎఫ్ఏ రాత పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బృందం సంపత్ ను ఘనంగా సన్మానించారు. విద్యార్థులందరూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీడిసి సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Notebooks worth Rs. 15,000 were distributed

More articles

Latest article