పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 8వ తరం మనవడి పట్టాభిషేకానికి హాజరైన నిజామాబాద్ విశ్వకర్మ ప్రముఖులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కడప జిల్లాలోని బద్వేలు మండలం కంది మళ్ళయ్య పల్లి గ్రామంలోని బ్రహ్మం మఠం లో గురువారం పోతూలురి వీర బ్రహ్మేంద్ర స్వామి 8వ తరం మనవడు వీర ధర్మజ వెంకటాద్రి స్వామి 12వ పీఠాధిపతిగా పట్టాభిషిక్తుడు అయ్యాడు.

ఈ పట్టాభిషేక మహోత్సవానికి నిజామాబాద్ జిల్లా నుంచి విశ్వకర్మలు యువ వ్యాపారవేత్త సమాజసేవకుడు పడకంటి రాము, రాము కుమారుడు పడకంటి ఆదిత్య, విశ్వకర్మ రాష్ట్ర కోశాధికారి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస చారి, జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, జిల్లా స్వర్ణకార సంఘం ఆర్గనైజింగ్ సభ్యులు రావుట్ల రాజేష్, బంధనకంటి నర్సింహ చారి, స్వర్ణకారుడు నారోజు మురళీధర్ చారి తదితరులు హాజరయ్యారు.
