29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘన్ పూర్ లో యువకుడి హత్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, డిచ్ పల్లి

డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్ పూర్ గ్రామంలో యువకుడి హత్య జరిగింది. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఘన్ పూర్ గ్రామంలోని కలుబట్టి వద్ద నడిపల్లి తాండకు చెందిన బట్టు కృష్ణ హత్యకు గురయ్యాడు. బుదవారం రాత్రి కల్లు సేవించిన తర్వాత జరిగిన ఘర్షణలో కృష్ణ హత్యకు గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కూలి పని చేసుకుని బట్టు కృష్ణ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని డిచ్ పల్లి సిఐ మల్లేష్ పరిశీలించారు . బట్టు కృష్ణ హత్య జరిగిన సమయంలో కల్లు బట్టి ప్రాంతంలో స్థానికంగా ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు.

More articles

Latest article