బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పట్టణ కేంద్రంలో విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో ఎన్నికల ప్రక్రియల భాగంగా జరిగే విధానంపై మాక్ ఎలక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల, భారతదేశంలో నిర్వహించే ఎన్నికల విధానంపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు మాక్ ఎన్నికల నిర్వహణ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎలక్షన్లో ఆరుగురు విద్యార్థులు పోటీ పడగా విజేతగా బి.సాత్విక్, రెండవ స్థానంలో ఎమ్. భార్గవి, మూడో స్థానం సిహెచ్ యశ్వంత్ రెడ్డి నిలవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, ఎన్నికల అధికారుల విధులు నిర్వహించిన విద్యార్థిని విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
