రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన పద్మ ధనుష్, జేయన్సీ కాలనీకి చెందిన కుర్లెం చిన్న కిష్టయ్యలు తమ మొబైల్ ఫోన్ లను పోగొట్టుకొని రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ లను కనిపెట్టి శనివారం ఎస్సై సాయన్న బాధితులకు అందజేశారు. దీంతో భాదితులు పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.