బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన మార్కండేయ జయంతి కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో స్వామివారిని దర్శించుకుని అర్చకులు ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
