వెబ్ న్యూస్, బతుకమ్మ : డంపింగ్ యార్డ్ తొలగించాలని చెత్తకుప్పలో కూర్చుని సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ధర్నాకు దిగారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మచ్చ బొల్లారంలో శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానికులకు మద్దతుగా చెత్తకుప్పలో కూర్చుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
