నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యాపకుల వార్షిక సదస్సు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో ఈనెల 21న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులు డాక్టర్ లక్షణ చక్రవర్తి పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీలో 120 క్రెడిట్స్ బదులుగా తెలుగుకు 12 క్రెడిట్స్ మాత్రమే ఇస్తామన్న దృష్టితో ఉందని, దీనికి సంబంధించిన అంశంలో స్పష్టత తీసుకొచ్చి తెలుగు భాష గొప్పదనాన్ని ముందుకు తీసుకుపోయే కార్యచరణను ఈ సదస్సులోచర్చించాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల తెలుగు అధ్యాపకులు హాజరుకావాలన్నారు. ఈ సదస్సులో ఆచార్యకే లావణ్య, ఆచార్య కనకయ్య, తదితరులు పాల్గొంటారని తెలిపారు.
