నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ – సిబిసిఎస్, బి ఏ, బీకాం, బిఎస్సి./ బిబిఏ, బిసిఎ రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ మరియు ఒకటవ. మూడవ. ఐదవ సెమిస్టర్ బ్యాక్లాగ్ (2020 నుండి 2024 బ్యాచ్ ల కు) పరీక్షలు నాలుగవ రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షలకు 6040 మంది విద్యార్థులకు 5689 మంది విద్యార్థులు హాజరయ్యారుకాగా 351 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 6372 మందివిద్యార్థులకు 5898 మంది విద్యార్థులు హాజరయ్యారు. 479 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
