బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో కేజీబీవీ స్కూల్ ను మండల వైద్యాధికారి రక్షిత సోమవారం సందర్శించారు. స్కూల్ లోని పరిసరాలను,హాస్టల్ రూమ్ లను,వాష్ రూమ్ వంటగదిని,స్టోర్ రూంను పరిశీలించి పలు సూచనలు చేశారు.పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఇట్టి కార్య క్రమంలో ఎస్ ఓ సంధ్య, ఉపాధ్యాయులు,ఆరోగ్య,నాన్ టీచింగ్ సిబ్బంది, ఆశాలు,పాల్గొన్నారు.
