30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కవన కుసుమాలు కవితా సంకలనం పుస్తకావిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగర శివారులోని బోర్గామ్ (పి) లో గల లక్ష్మీ గణపతి ఆలయంలో మంగళవారం ప్రముఖ కవి రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు స్వర్ణ లక్ష్మణరావు సాహిత్య సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు స్వర్ణ సమత సహకారంతో విద్యార్థులు రచించిన కవన కుసుమాలు కవితా సంకలనాన్ని ప్రముఖ కవి రచయిత కాసర్ల నరేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ కవి రచయిత్రి స్వర్ణ సమత ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పుతూనే కవితలు రచనల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి వారిచేతనే కవితలు రాయించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం గొప్ప విషయం అన్నారు.

More articles

Latest article