- సిబిఐ కి కేసు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నాం
- నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, బతుకమ్మ : కరప్షన్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ బాధ్యతను సిబిఐ కి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నాం అని నిజామాబాద్ లో మీడియాతో అన్నారు. డిజైన్ లు లోకెషన్లు మార్చేశారని అవినీతికి పాల్పడిన ఎవరిని వదిలిపెట్టొద్దని నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది కుడా సీబీఐ విచారణే అని అన్నారు. విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలి అన్నారు. రెండేళ్లు ఎందుకు కాలయాపన చేశారో స్పష్టం చేయాలి అని డిమాండ్ చేశారు.