బతుకమ్మ, జుక్కల్ : బుధవారం జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోల్ బంకును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. నాణ్యమైన పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

