26.3 C
Hyderabad
Monday, August 3, 2026

క్షత్రియ సమాజ్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ మెంబర్ గా   జెస్సు అనిల్ కుమార్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : సోమవంశీయ సహసార్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి )ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కమిటీని నియమించారు. రాష్ర్ట మేనేజింగ్ కమిటీ మెంబర్ గా జెస్సు అనిల్ కుమార్ నియమితులయ్యారు. రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ్(రిటైర్డ్ ఐపీఎస్), ప్రధాన కార్యదర్శి టంక్ విష్ణు, ఎస్ ఎస్ కే రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్జాపూర్ శ్రీనివాస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖాందేశ్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు పడాల్ గణేశ్, శివ పండిత్ తోపాటు ఎస్ ఎస్ కే సమాజ్ మామిడిపల్లి అధ్యక్షుడు ఖాందేశ్ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి అల్జాపూర్ దాత నంద కిశోర్, కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article