- కానిస్టెన్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేపూరి చరణ్ గౌడ్
భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని బాల్కొండ కానిస్టెన్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేపురు చరణ్ గౌడ్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. శనివారం సాయంత్రం 4:00 గంటలకు బాల్కొండ నియోజకవర్గం నుండి గ్రామ గ్రామానా యువజన కాంగ్రెస్ నాయకులు, యువకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క పాద యాత్ర ను విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో మాజీ జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ వాకా మహేష్,భీంగల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవినాష్,ఉపాధ్యక్షులు సురేష్, మురారీ, జేమ్స్,రవి, సాయీ, దినేష్, ధనిష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
