హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ సోదాల కలకలం రేపింది. ఏక కాలంలో 15 చోట్ల ఆశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రముఖ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్ మెహిఫిల్ లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈహోటళ్లు ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ఈహోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు జరిపి పలు పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
