బతుకమ్మ,ఏర్గట్ల: మండలంలోని దొంచంద గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించి పథకాల ఉత్తర్వు పత్రాలను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించి తర్వాత పథకాల ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో, ఏపీవో, ఎంపీవో, తాసిల్దార్, ఏపీఎం ,ఏవో పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
