నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని పద్మ నగర్ కోట గల్లీ లోని వివేకానంద విద్యాలయం ఉన్నత పాఠశాలలో 1997-98 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విహన్ సొసైటీ సేవ సంస్థ వారు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు సొసైటీ వారు వారి తో చదివిన తోటి విద్యార్ధి గన్ను సింగ్ ఆర్థిక సమస్య లతో బాధపడుతున్నాడు తెలుసుకొని ఆయన జీవనోపాది కొరకు డ్డెలివరీ బాయ్ ఉద్యోగం తో పాటు ద్విచక్ర వాహనాన్ని ఆయనకు అందజేశారు.ఇతని తో పాటు ఆ స్కూల్ లో పని చేసిన ఆఫీస్ బాయ్ శంకర్ కు రెండు నెలల రేషన్ అందజేయడం. ఈ సొసైటీ భవిష్యత్తు లో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం అని ఈ సంస్థకు అందరు వారి వంతు నిధులు సమకూర్చాలని దాని వలన మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడతాం అని సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

