బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ ఆర్టీసీ డిపో లో శుక్రవారం ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిపో మేనేజర్ రవి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సలీం, కార్యదర్శి హఫీస్, సయ్యద్ ఇంతియాజ్ , కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

