- మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్
భీమ్ గల్, బతుకమ్మ : మనం చెట్లను రక్షిస్తే మనల్ని చెట్లు రక్షిస్తాయని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని కెసీఆర్ కాలనీ వద్ద ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం పేరిట ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంటుందన్నారు. ప్రతి ఒక్కరు భాద్యతగా తమ తమ ఇంటి ఆవరణలో కనీసం రెండు మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమం లో మేనేజర్ నరేందర్, మెప్మా సిబ్బంది,వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
