25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రియుడి మోజులో పడి భర్త, కూతురి హత్య

Must read

📰 Generate e-Paper Clip

  • కూతురి మృతదేహం చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు సృష్టించిన కిల్లర్ లేడీ

 

జయశంకర్ భూపాలపల్లి, బతుకమ్మ : ప్రియుడి మోజులో పడి భర్తను, 22ఏళ్ల కూతురిని ఓ కసాయి తల్లి హత్య చేసిన దారుణ ఘటన  జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో చోటుచేసుకుంది. భర్త పక్షవాతంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కవిత అనే మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని, ప్రియుడితో కలిసి వర్షిణి(22)ని కూడా కడతేర్చింది. కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి – కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించింది. పోలీసుల దర్యాప్తులో కవిత తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. 2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు కిల్లర్ లేడీ ఒప్పుకుంది. మరో హత్య కోసం కూడా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ప్రియుడిని, కవితను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.

More articles

Latest article