బతుకమ్మ, భిక్కనూరు : చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని శుక్రవారం భిక్కనూరు ఎస్సై సాయికుమార్ తెలిపారు. ఎస్సై సాయికుమార్ మాట్లాడుతూ సెల్ ఫోన్లు చోరీకి గురై న వెంటనే ఐఎంఈ ఐ నెంబర్లతో తమకు ఫిర్యాదు చేస్తే సి ఇ ఐ ఆర్ పోర్టల్ సహాయంతో చోరీకి గురైన ఫోనును రికవరీ చేయడం జరుగుతుందన్నారు. భిక్కనూరు పరిధిలో ఏడుగురి సెల్ ఫోన్లు చోరీకి గురికాగా బాధితులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వాటిని సీఈఐ ఆర్ సహాయంతో రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై 2 రామచంద్రనాయక్ సిబ్బంది పాల్గొన్నారు.