వెబ్ న్యూస్ బతుకమ్మ: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆంధ్రపదేశ్ రాష్ర్టంలోని గుంటూరుకు చెందిన దీప్తి టెక్సాస్ లో స్నేహితురాలితో కలిసి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించి క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. దీప్తి మృతదేహాన్ని గుంటూరుకు తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి పెమ్మసానితోపాటు ఆయన సోదరుడు రవి చర్యలు చేపట్టారు.