డిచ్ పల్లి, బతుకమ్మ: మండలంలోని ధర్మారం (బీ)లో ఉన్న సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో, ఫ్యాన్సీ డ్రెస్ లతో చిన్నారులు ఆకట్టుకున్నారు. చిన్నారుల డ్యాన్స్ లు ఎంతో ఆకట్టుకున్నాయి. ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ మరియా రాజు, బోధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

