29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతులకు మెరుగైన సేవలు అందించడానికే సహకార సంఘాలు

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద జెండా ఆవిష్కరణ

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద గురువారం సంఘ ఉపాధ్యక్షులు తోట అరుణ్ కుమార్ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, అనంతరం సహకార సంఘ జెండా ఆవిష్కరించి, సహకార సంఘ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలు అందించడానికి సహకార సంఘాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు ఏర్రోళ్ల శ్రీనివాస్, పత్తయ్య, నాయకులు గోవింద్ రావు పటేల్, వ్యవసాయ సహకార సంఘ సిఈఓ ఎర్రోళ్ల సాయికిరణ్, సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article