వెబ్ న్యూస్, బతుకమ్మ : కేరళ రాష్ట్రం పలక్కాడ్ జిల్లా ఎలవెంచరి గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ క్షేత్రాలను రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పరిశీలించారు. కూరగాయల సాగుపై వారి అనుభవాలు, సాగు విధానాలు, లాభాలపై రైతుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈబృందంలో వ్యవసాయ ,రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రామ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సభ్యులు కెవియన్ రెడ్డి, సభ్యులు భవాని రెడ్డి, ఇతర సభ్యులు ఉన్నారు.
