రుద్రూర్, బతుకమ్మ : మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని చేతిలో లడ్డును గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి పట్టేపు రాములు 35 వేలకు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు లడ్డును అందజేశారు. లడ్డును కైవసం చేసుకున్న పట్టెపు రాములును గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంల శాలువాతో ఘనంగా సత్కరించారు.
