29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బీజేపీలో చేరిన అక్బర్ నగర్ మాజీ సర్పంచ్

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ తీగుళ్ల రాజా వర ప్రసాద్ బుధవారం బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మి నారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా రాజా వర ప్రసాద్ మాట్లాడుతూ.. మోదీజీ బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలోకి రావడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో  బీజేపీలోకి ఇతర చాలా కార్యకర్తలు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ గౌడ్, కటికే రామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article