మహిళపై అత్యచారం కేసులో ఐదుగురి అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ నుంచి ఆటోలో మహిళను తీసుకువేళ్లి డిచ్ పల్లి ప్రాంతంలో అత్యచారం చేసిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు నిజామాబాద్ ఓకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘపతి తెలిపారు. ఈ నెల 18న రాత్రి ఓక మహిళను డిచ్ పల్లి మండలం మిట్టపల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన జైనుద్ధిన్ ఖురేషీ, ఘన్ పూర్ గ్రామంలోని ఇస్లాంపురకు చెందిన మోహసీన్ ఖురేషీ, మిట్టపల్లికి చెందిన మహ్మద్ సుల్తాన్, డిచ్ పల్లి నాగేపూర్ గేట్ ప్రాంతానికి చెందిన నగేష్ చీలంకర్, డిచ్ పల్లి మండలం నడిపల్లికి చెందిన షేక్ రఫీక్ లు ఆటోలో త సుకువేళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి పిర్యాదు మేరకు ఐదుగురిపై అత్యచారం , ఎస్ సీ ఎస్టి అత్యాచారాల నిరోదక చట్టం క్రింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్టు ఎస్ హెచ్ఓ తెలిపారు. వారి వద్ధనుంచి ఆటో, బైక్ ను స్వాధినం చేసుకున్నారు.
