బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ సన్న బియ్యాన్ని తినాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని గ్రామ శాఖ అధ్యక్షులు మిట్టపల్లి దేవేందర్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గల రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో శ్యామ్ గౌడ్, మహేష్, రాజు,అనిల్, నరేష్, రేషన్ డీలర్ వంశీ, తదితరులు పాల్గొన్నారు.