తెయూలో ఇంజినీరింగ్ కోర్సులు

0 5,149

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కోర్సులకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ సెక్రెటరీ యోగితా ఉత్తర్వులను జారీ చేసింది. ఈఏడాది నుంచి బీటెక్ (సీఎస్ఈ), బీటెక్ (సీఎస్ఈ- ఏఐ), బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, బీటెక్ డేటా సైన్స్ కోర్సుల కు  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి కోర్సులో 60 మంది విద్యార్థులు ఉంటారు. కాగా, తెయూలో ఇంజినీరిగ్ కోర్సులకు అనుమతించిన ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

Engineering courses in T.U

Leave A Reply

Your email address will not be published.