మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ పి ఆర్ టి యు మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రగతి కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాములు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇద్దరినీ పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కిషన్, జిల్లా మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ పటేల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గంట అశోక్, మోర్తాడ్ మండల పిఆర్టి మాజీ అధ్యక్షులు మగ్గిడి ప్రవీణ్, రాష్ట్ర అసోసియేట్ అభ్యర్థులు సాయి రెడ్డి, దశెంధర్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మండల అసోసియేట్ అధ్యక్షులు రవి, సీనియర్ నాయకులు వినయ్ సాగర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
