నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఆదర్శ మున్నూరు కాపు సంఘం వారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నటు నూతన అధ్యక్షులు పెట్టి గాడి లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా ఎన్నికైన తమ నూతన కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. సంఘం అధ్యక్షులుగా పెట్టిగాడి లక్ష్మీ నారాయణ, గౌరవ అధ్యక్షులు గా ఖానాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి గా కోర్వ నర్సయ్య, కోశాధికారి గా అయిటి శంకర్, ఉపాధ్యక్షులు గా బొల్లం కిషన్, వెల్పుల సంజీవ్, తోట నరేందర్, ఆలూరి అశొక్, సంయుక్త కార్యదర్శులు గా రంగు సీతారాం, గుమ్ముల ప్రదీప్, తోట రవీందర్, నూర సుధాకర్, పెద్ద కాపులు గోపు సుదర్శన్, ఖానాపూర్ సుదర్శన్, సలహాదారులు గా జువ్వాజి మల్లేశ్వర్, తోట రాజశేఖర్, రవీందర్ అబ్బాపుర్, మూర్తి పండర్తి, ఆలూరి రాజేశ్వర్, డైరక్టర్లు గా గంధం రాజు, జి.ప్రవీణ్, పరిగే సాయి కుమార్, ముదం భైరయ్య లను ఎన్నుకున్నట్టు వారు తెలిపారు.
