. . . కాలేశ్వరం లో అవినీతి అని చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నిరసన
. . . చెక్కుల పంపిణీ సందర్భంగా ఘటన
నర్సాపూర్, బతుకమ్మ :
మెదక్ జిల్లాలో ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగలు తాకాయి. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ వెంకటస్వామి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రజలు నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా బీఆర్ఎస్ పై విమర్శలు చేయడంతో సభలో ఒక్కసారి మంత్రిని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు.
