కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడాల పురందర్ శుక్రవారం విద్యార్థులకు 73 రైటింగ్ పాడ్లు,పెన్నులను అందజేశారు. తన కుమారుడు పడాల సాత్విక్ పుట్టినరోజును పురస్కరించుకొని స్థానిక ఎంపీపీఎస్ స్కూల్ విద్యార్థులందరికీ ప్యాడ్లు, పెన్నులతో పాటు స్కూలుకు రెండు వైట్ బోర్డ్స్ (టీచింగ్ బోర్డ్స్) బహుమతిగా ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేందర్, రాజ్ పండరి , దిలీప్, కావ్య,పద్మ సౌజన్య రుచిత సంజన తదితరులు పాల్గొన్నారు..