నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: మోపాల్ మండలం ముదక్ పల్లి కి చెందిన పలువురు లబ్ధిదారులకు నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
