మద్నూర్, బతుకమ్మ: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయా నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు డోoగ్లీ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానన్ దేశాయ్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, శివాజీ పటేల్, దినదయాల్ పటేల్, ఉమాకాంత్ పటేల్, యునుస పటేల్ ,లక్ష్మణ్ పటేల్, నాగేష్ పటేల్, శివా రెడ్డి, విలాస్, సాయలు గోండా,లక్ష్మణ్, అర్జున్ పటేల్ పాల్గొన్నారు.