బతుకమ్మ, మద్నూర్/డోంగ్లి : దిండి ఊరేగింపులో దండిగా భక్తులు పాల్గొన్నారు. మంగళవారం హాజరై మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో భక్తులు పాదయాత్రతో పాటు దిండి ఊరేగింపు భక్తి పాటలు, నినాదాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ ఆలయాలను దర్శించుకున్నారు. పదిహేనేళ్ల క్రితం కొందరితో మొదలైన దిండి ఊరేగింపు ఇప్పుడు వందల సంఖ్యలో భక్తులతో మహిళలు, పిల్లలు అత్యధికంగా పాల్గొంటున్నారు.

