28.8 C
Hyderabad
Monday, August 3, 2026

స్మశాన వాటికకు నిధులు మంజూరు పట్ల హర్షం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్:-మండలంలోని వేల్పూర్ గ్రామ ముస్లిం స్మశాన వాటిక (ఈద్గా) అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల నిధులను మంజూరు చేసింది. దీంతో స్థానిక ముస్లిం మైనారిటీ సోదరులు  హర్షం వ్యక్తం చేశారు ఇది తమకు ఎంతో ఆనందానిచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు ముస్లిం స్మశాన వాటిక ప్రహరి గోడకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

More articles

Latest article