ఉదయం నుంచే బారులు తీరిన భక్తలు
వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. యాదగిరి గుట్ట, భద్రాచలం, స్వర్ణగిరి, చిలుకూరు, హిమయత్ నగర్ వేంకటేశ్వర స్వామి , కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.


